పాక్ తో ఉద్రిక్తతల కారణంగా సీఏ పరీక్షలు వాయిదా

పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో జరగాల్సి ఉండగా.. గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలో తెలియజేస్తామని పేర్కొంది. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్ icai.orgలో అధికారిక నోటీసును తనిఖీ చేసుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *